Delhi Terror Attacks: ఢిల్లీలో లాస్ట్ టైం ఎప్పుడు బ్లాస్ట్ జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Terror Attacks: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడుతో గాయపడిన వారి సంఖ్య దాదాపు 24 మంది ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పేలుడు 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ శాంతికి విఘాతం కలిగించింది. గతంలో దేశ రాజధాని 2008లో బాంబు పేలుళ్లను చూసింది. భారత రాజధాని అధికార కేంద్రంగా మాత్రమే కాకుండా దేశ భద్రత, శాంతికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా నగరం అనేకసార్లు భీభత్సంలో మునిగిపోయింది. ఇక్కడ జరిగిన పేలుళ్లు ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి దారితీయడమే కాకుండా, దేశ భద్రతా వ్యవస్థ, నిఘా యంత్రాంగం, ప్రజల విశ్వాసాన్ని కూడా కదిలించాయి.
READ ALSO: Koti Deepotsavam 2025 Day 10: అంగరంగ వైభవంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం..
Also Read
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
- Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
బాంబు దాడులు..
* ఢిల్లీలో మొట్టమొదటి పెద్ద బాంబు దాడులు 1985లో జరిగాయి. మే 10న అనేక ప్రదేశాలలో ఒకేసారి ట్రాన్సిస్టరైజ్డ్ బాంబులు పేలాయి. ఢిల్లీలో ఈ పేలుళ్ల కారణంగా 49 మంది మరణించగా, 127 మంది గాయపడ్డారు. ఈ దాడులు బస్సులు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత ఢిల్లీలో భయాన్ని నాటుతూ జరిగిన మొదటి పెద్ద ఉగ్రవాద సంఘటన ఇది.
* ఆ తర్వాత మే 21, 1996న లజ్పత్ నగర్లోని సెంట్రల్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ రోజు సాయంత్రం రద్దీగా ఉండే మార్కెట్ మధ్య జరిగిన భారీ పేలుడు కారణంగా 13 మంది మరణించారు, 38 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి జమ్మూ, కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్ బాధ్యత వహించింది. కాశ్మీర్లో ఉగ్రవాదం వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయం అది. దాని జ్వాలలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ సంఘటన ఉగ్రవాదం ఇకపై సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాదని, రాజధానికి కూడా చేరుకుందని స్పష్టం చేసింది.
* 2005లో అక్టోబర్ 29న దీపావళికి కేవలం రెండు రోజుల ముందు మూడు ప్రదేశాలలో ఒకేసారి మూడు పేలుళ్లు సంభవించాయి. పహార్గంజ్, గోవింద్పురి, సరోజిని నగర్ మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లు మొత్తం దేశాన్ని కుదిపేశాయి. ఈ బాంబు దాడి కారణంగా 62 మంది మరణించగా, 210 మందికి పైగా గాయపడ్డారు. లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న ఒక సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. పండుగల సమయంలో జరిగిన ఈ సంఘటన, ఉగ్రవాదులు ఏ అవకాశాన్ని అయినా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చని నిరూపించింది.
* సెప్టెంబర్ 13, 2008న ఢిల్లీ మరోసారి ఉగ్రవాదం జరిగింది. ఆ రోజు కరోల్ బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్లలో దాదాపు ఒకేసారి ఐదు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఇండియన్ ముజాహిదీన్ బాధ్యత వహించింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వరుస బాంబు దాడులు జరిగిన కాలం ఇది. జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత, ఢిల్లీలో కూడా ఇదే తరహా దాడులు జరిగాయి.
* సెప్టెంబర్ 27, 2008న మెహ్రౌలి పూల మార్కెట్లో టిఫిన్ బాక్స్లో ఉంచిన బాంబు పేలింది. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు యువకులు టిఫిన్ బాక్స్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత ఒక శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు, 23 మంది గాయపడ్డారు.
* ఆ తరువాత సెప్టెంబర్ 7, 2011న ఢిల్లీ హైకోర్టు వెలుపల పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలను బ్రీఫ్ కేసులో ఉంచారు. ఈ పేలుడులో అనేక మంది గాయపడ్డారు, కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ (IDSA) నివేదికల ప్రకారం.. 1997 నుంచి ఢిల్లీలో 26 పెద్ద పేలుళ్లు జరిగాయి. వీటి కారణంగా 92 మందికి పైగా మరణించారు, 600 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనల తరువాత, భద్రతా సంస్థలు అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నాయి. మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో CCTV నిఘా పెంచారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, NIA లను బలోపేతం చేశారు. బాంబు గుర్తింపు బృందాలను విస్తరించారు. ఢిల్లీ దేశ రాజకీయ, పరిపాలనా కేంద్రం, ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంట్ భవనం, విదేశీ రాయబార కార్యాలయాలు వంటి సున్నితమైన ప్రదేశాలకు నిలయంగా ఉండటం వలన తరచుగా ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉంది. రాజధాని జనాభా, రద్దీగా ఉండే మార్కెట్లు, పండుగ సీజన్ దీనిని ఉగ్రవాదులకు సులభమైన లక్ష్యంగా మారుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!
తాజావార్తలు
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..