Site icon NTV Telugu

Aravind Kejriwal : అసెంబ్లీలో మారిన కేజ్రీవాల్ సీటు.. సీటు నం.1లో కూర్చున్న అతిషి

New Project 2024 09 26t141123.559

New Project 2024 09 26t141123.559

Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కుర్చీ మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ సీటు సంఖ్య 1 నుంచి 41కి మారింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అతిషి సీటు నంబర్ 1లో కూర్చుంటారు. సౌరభ్ భరద్వాజ్ సీటు నంబర్ 2లో ఆమె పక్కన కూర్చుంటారు. కాగా, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీటు నంబర్ 40లో కూర్చుంటారు.

Read Also:Devara-NTR: ‘దేవర’ భయాన్ని పోగొడతాడా?.. లేదా మరింత భయపెడతాడా?

అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, సెప్టెంబర్ 21న అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కొత్త ముఖ్యమంత్రి అతిషి.. ఆమె క్యాబినెట్‌తో పాటు ప్రతిపక్ష నాయకుడు విజేంద్ర గుప్తాను అభినందించారు. మాజీ ప్రతిపక్ష నేత రాంబీర్ సింగ్ బిధూరి ఎంపీగా ఎన్నికైన కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. కాగా, ఆప్ మాజీ ఎమ్మెల్యేలు రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్ కుమార్ ఆనంద్, కర్తార్ సింగ్ తన్వర్‌లు సభకు అనర్హులుగా ప్రకటించారు.

Read Also:P. Chidambaram: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..

ఖాళీగా ఉన్న సీట్లను నోటిఫై చేసి ఎన్నికల సంఘానికి తెలియజేశామని స్పీకర్ తెలిపారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. కాగ్ నివేదికను సమర్పించకపోవడంపై ప్రతిపక్ష నేత సహా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కులదీప్‌ కుమార్‌ బస్‌ మార్షల్స్‌కు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని సభలో లేవనెత్తుతూ నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభను కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.

Exit mobile version