Site icon NTV Telugu

Daggubati Purandeswari : రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించనున్న పురందేశ్వరి

Purandeswari

Purandeswari

రాజమండ్రిలో నేడు ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్‌ను పురందేశ్వరి ప్రారంభించనున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్నారు పురందేశ్వరి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిన్న దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధుల నుంచి ఎండోమెంట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలన్నారు పురంధేశ్వరి. ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.

Exit mobile version