Crime News: బాలానగర్లో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి

  • హైదరాబాద్‌ బాలానగర్ లో దారుణ ఘటన
  • తల్లి చల్లారి సాయిలక్ష్మీ (27) తన ఇద్దరు పిల్లలను హత్య
  • ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య
  • కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు కారణమని ప్రాథమిక సమాచారం.
Delhimurder

Delhimurder

Crime News: హైదరాబాద్‌ లోని బాలానగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్ లో నివాసం ఉంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు.

Hi-Fi ఆడియో, AI కాల్ నాయిస్ రిడక్షన్, మల్టీ-డివైస్ సపోర్ట్‌తో Vivo TWS 5 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?

×
×
Ad

అందించిన సమాచారం మేరకు గత కొంతకాలంగా భర్తతో వచ్చిన కుటుంబ విభేదాలు, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, ఆవేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!