Crime: అర్రాలో దుండగుల దుశ్చర్య.. ముగ్గురు స్నేహితులపై కాల్పులు
- బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో కాల్పుల కలకలం
- అర్రాలో ముగ్గురు స్నేహితులను కాల్పులు
- ఒకరు అక్కడికక్కడే మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అర్రాలో దుండగుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. తాజాగా.. దుండగులు ముగ్గురు స్నేహితులను కాల్చారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
Read Also: Advocate Murder : అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్య కేసులో వీడిన మిస్టరీ
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ ఘటన అర్రా పట్టణంలోని రామ్గరియా ప్రాంతంలో చోటు చేసుకుంది. రామ్గరియా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ముగ్గురు యువకులపై దుండగులు తుపాకులతో దాడి చేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు పాత కక్షలు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బాధితులు గతంలో దుండగులతో గొడవ పడ్డారని తెలిపారు. మద్యం విషయం ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Manoj Bharathi Raja : పరిశ్రమలో విషాదం.. స్టార్ డైరెక్టర్ కుమారుడు మృతి
కాగా.. గాయపడిన ఓ వ్యక్తి మాట్లాడుతూ మద్యం అమ్మకం విషయంలో గతంలో విభేదాలు జరిగాయని చెప్పాడు. ఆ ఘటనల కారణంగా తమపై అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారని తెలిపాడు. ఈ ఘటనపై అరా అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిశీలిస్తున్న పోలీసులు, దుండగుల వివరాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు.. కాల్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!