Crime: అర్రాలో దుండగుల దుశ్చర్య.. ముగ్గురు స్నేహితులపై కాల్పులు
- బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో కాల్పుల కలకలం
- అర్రాలో ముగ్గురు స్నేహితులను కాల్పులు
- ఒకరు అక్కడికక్కడే మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అర్రాలో దుండగుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. తాజాగా.. దుండగులు ముగ్గురు స్నేహితులను కాల్చారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
Read Also: Advocate Murder : అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్య కేసులో వీడిన మిస్టరీ
Also Read
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ఈ ఘటన అర్రా పట్టణంలోని రామ్గరియా ప్రాంతంలో చోటు చేసుకుంది. రామ్గరియా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ముగ్గురు యువకులపై దుండగులు తుపాకులతో దాడి చేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు పాత కక్షలు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బాధితులు గతంలో దుండగులతో గొడవ పడ్డారని తెలిపారు. మద్యం విషయం ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Manoj Bharathi Raja : పరిశ్రమలో విషాదం.. స్టార్ డైరెక్టర్ కుమారుడు మృతి
కాగా.. గాయపడిన ఓ వ్యక్తి మాట్లాడుతూ మద్యం అమ్మకం విషయంలో గతంలో విభేదాలు జరిగాయని చెప్పాడు. ఆ ఘటనల కారణంగా తమపై అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారని తెలిపాడు. ఈ ఘటనపై అరా అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిశీలిస్తున్న పోలీసులు, దుండగుల వివరాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు.. కాల్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!