Secunderabad: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.20కోట్లతో ఉడాయించిన దంపతులు
- చిట్టీల పేరుతో మోసం
- రూ. 20 కోట్లు దండుకుని పారిపోయిన జంట
- స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- అంతలోపే స్టేషన్కు చేరుకున్న దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిట్టీల పేరుతో 20కోట్ల రూపాయల మోసానికి పాల్పడి అదృశ్యమైన దంపతులు తమకు తామే పోలీసుల ముందు ప్రత్యక్షమైన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులు బాపూజీ నగర్ కు చెందిన అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు అందరికీ నమ్మకంగా గత 20ఏళ్లుగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఐతే ఇటీవలి కాలంలో చిట్టీ పాట పాడికున్న వారికి చిట్టి డబ్బులు ఇవ్వకుండా సతాయించడమే కాకుండా గత నెల 14న దంపతులు ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారు పారిపోయారని, తాము నష్టపోయామని భావించి బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా మంగళవారం రోజు వారికి వారే వచ్చి పోలీసు స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు.
READ MORE: Usha chilukuri: అమెరికా సెకండ్ లేడీగా ఆంధ్రా అమ్మాయి.. ఏపీలో ఎక్కడంటే..!
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
విషయం తెలుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ధర్నా చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి జమ చేసుకొని తమ ఆడపిల్లల పెళ్ళీల కోసం, ఉన్నత చదువుల కోసం, ఇళ్ల నిర్మాణం కోసం వివిధ అవసరాలకోసం ఉపయోగించుకుందామని అమరేందర్ వద్ద దాచుకున్నమని వారు తెలిపారు. ఒక్కొక్కరు 10లక్షలు, 20లక్షలు, 50లక్షలు చొప్పున చిట్టీలు వేసి మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని మహిళలు, వృద్దులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐతే వారాసిగూడ ఇన్ స్పెక్టర్ ఆర్ సైదులు మాట్లాడుతూ చిట్టీ వేసిన వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వారికి వారే నిన్న పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!