NTV Telugu Site icon

Srisalam 1Town PS: శ్రీశైలం వన్‌టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!

Btesh Student Manoj Dead

Btesh Student Manoj Dead

Constable Suicide in Srisalam: నంద్యాల జిల్లా శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. పీఎస్‌లో పిస్టల్‌తో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్‌ రెడ్డి అనే కానిస్టేబుల్‌.. బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్‌స్టేషన్‌ విశ్రాంతి గదిలోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌ రావు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

శంకర్ రెడ్డి 2000 సంవత్సరం బ్యాచ్‌కి చెందిన వాడు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా? లేదా ఆర్థిక సమస్యలా? అనే కోణంలో శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నందికొట్కూరు మండలం దామగట్లకు చెందిన శంకర్ రెడ్డి అవివాహితుడు. కర్నూలు కృష్ణానగర్‌లో ఆయన నివాసముంటున్నాడు. ఇటీవలే నంద్యాల జిల్లాకు శంకర్ రెడ్డి బదిలీ చేయించుకున్నాడు.