గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది‘పై భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ వాయిదా వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం కొంత మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు 50 శాతం పూర్తయ్యాయి. నిజానికి సినిమా అనుకున్న సమయానికే రెడీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్ ‘క్వాలిటీ’ కోసం మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొందరపడి సినిమాను విడుదల చేయడం కంటే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిజి వర్క్ విషయంలో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలని టీమ్ భావిస్తోంది. సిజి పనులకు మరికొంత సమయం పడుతుండటంతో అలానే రెహమాన్ నేపధ్య సంగీతం వర్క్ కూడా కొంత మేర బాకీ ఉండేదంతో హడావిడిగా కాకుండా అవుట్పుట్ అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే విడుదల తేదీని వెనక్కి జరిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ వాయిదాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన మేకోవర్ కనిపిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
