కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని బొగ్గు గనుల పై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు,నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయటం ద్వారా బొగ్గు ప్రాజెక్టులను బడా ప్రవేట్ సంస్థలకు అప్పగించి ప్రభుత్వ బొగ్గు రంగ సంస్థలను నిర్విర్యం చేయటమే కాక కార్మికుల హక్కులను ఉపాధి అవకాశాలను లేకుండా చేయటం జరుగుతుందని,కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రవేటీకరణ చేయమని ప్రకటిస్తూనే తెలంగాణలోని బొగ్గు ప్రాజెక్టులను సింగరేణికి కేటాయించకుండా వేలంలో పెట్టారని,ఈ వేలంలో సింగరేణి పాల్గొనకుండా ఆంక్షలు పెట్టారని ఆరోపించారు.దేశంలోని వనరులు,ప్రభుత్వరంగ సంస్థలను దేశ,విదేశీ సంస్థలకు మోడీ ప్రభుత్వం కారు చౌకగా అమ్మి వేస్తుందన్నారు,వెంటనే కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Protest : బొగ్గు గనులను వేలం.. కార్మికులు నిరసన

Singareni