Site icon NTV Telugu

CM Jagan : వంకాయలపాడు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Cm Jagan

Cm Jagan

సీఎం జగన్‌ నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభించనున్నారు. అనంతరం.. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు సీఎం జగన్‌. ఆ తర్వాత.. గుంటూరు మెడికల్‌ కళాశాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్‌ బ్రాండ్‌ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. 10,000 మందికి పైగా రైతులతో సుమారు 170 గ్రామాల్లో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు గతంలో రాష్ట్రంలో పొగాకు వ్యాపారం మాత్రమే ఉండేంది.
Also Read : Vande Bharat Express: దక్షిణ భారత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాశీ దర్శన రైలును ప్రారంభించిన ప్రధాని

అయితే.. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషితో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది ఐటీసీ గ్రూపు. ఇందుకోసం ఐటీ స్పైసెస్‌ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసిన ఐటీసీ గ్రూపు.. వేగంగా విస్తరించింది. అయితే.. ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీ ఐటీసీ.. రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఏర్పాటు చేసింది.
Also Read : ACB: వైద్యఆరోగ్యశాఖలో అవినీతి జలగలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి

ఇప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. అయితే.. ఈ క్రమంలో.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ఈనేపథ్యంలోనే.. వంకాయలపాడు సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు.

Exit mobile version