NTV Telugu Site icon

Andhra Pradesh: రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Cm Jagan

Cm Jagan

రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గణపవరం హెలిప్యాడ్‌కు జగన్ చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు పిప్పర రోడ్డులోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సభా ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు.

Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని రైతుల అకౌంట్లలో నేరుగా నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. కాగా ఈనెల 17న మంగళవారం నాడు సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లుకు మండలం గుమ్మితంతాండా సమీపంలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును సీఎం జగన్ పరిశీలించనున్నారు.