Kishan Reddy : ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదనేదే ప్రధాని మోడీ లక్ష్యం
- కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం
- రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ :కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్లో భారతీయ విద్యా భవన్లో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత ఆహార సంస్థ, సీబీఐటీ, ఆదాయపు పన్ను శాఖ, తపాలా శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎయిమ్స్, రైల్వే వంటి విభాగాల నుంచి 154 మందికి నియామక పత్రాలు అందించారు.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఒక్క రోజే 51 వేల మంది కేంద్ర ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. వచ్చే ఉద్యోగానికి పూర్ణ అంకితంతో పని చేయాలని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఆయన కోరారు. 12 లక్షల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం లక్ష్యంగా ఉన్నామని చెప్పారు.
ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వ విభాగాలు విద్య, వైద్యం, రక్షణ, పరిశోధన వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పెట్టుబడులు ఉద్యోగావకాశాలను పెంచుతాయన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశ అభివృద్ధి, ఉగ్రవాదానికి నిరోధం, విద్యుత్ కొరత లేకుండా నూతన భారతాన్ని ఆవిష్కరించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోడీ 365 రోజులు దేశ అభివృద్ధి కోసం పయనిస్తున్నారని, ప్రతి దీపావళికి ఆర్మీ జవాన్లతో గడిపేందుకు సరిహద్దుల వైపు వెళ్లనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!