Site icon NTV Telugu

Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇకపై ఇలా చేయాల్సిందే!

Vande Mataram

Vande Mataram

వందేమాతం గీతంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జనగణమన ఆలాపనకు ముందే వందేమాతరం గీతం ప్లే చేయాలని ఆదేశించింది. ఇక గతంలో తొలగింపబడిన నాలుగు చరణాలను తిరిగి చేర్చింది. బుధవారం ఉదయం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది.

బుధవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో.. అన్ని పాఠశాలల్లో జాతీయ గీతానికి ముందు ‘‘వందేమాతరం’’ గీతం పాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల్లో పేర్కొంది. ‘‘వందేమాతరం’’ పాడినప్పుడు అందరూ నిలబడాలని కూడా కొత్త నిబంధనలో వెల్లడించింది. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కార ప్రదానోత్సవాల్లో.. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని ఇతర కార్యక్రమాల్లో.. వారి రాక.. నిష్క్రమణ సమయంలో కూడా జాతీయ గీతాన్ని ఇకపై ప్రదర్శించాలని తెలిపింది. సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా దీనిని ప్లే చేయాలని.. అయితే ఈ సందర్భంలో నిలబడటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

వందేమాతం గీతంపై గత సంవత్సరం కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ గేయంపై పెద్ద వివాదమే చెలరేగింది. నెహ్రూపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో 1937లో కాంగ్రెస్ తొలగించిన నాలుగు చరణాలతో సహా మొత్తం ఆరు చరణాలు ప్లే చేయనున్నారు.

చట్టం ప్రకారం.. జాతీయ గీతాన్ని అంతరాయం కలిగించడం లేదా ఇతరులు గౌరవించకుండా నిరోధించే ఏ వ్యక్తికైనా గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.

Exit mobile version