Fake Baba: జాతకం చెడిందన్నాడు.. కానీ జేబు మాత్రం బాగా నిండించుకున్నాడు
- బంగారం మోసం చేసిన బురిడీ బాబా
- జాతకం పేరిట బెదిరింపులు
- కాచిగూడలో కేసు, అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Baba: మీ జాతకం బాగాలేదని, శాంతి పూజలు చేయాలంటూ ఓ మహిళ ను బెదిరించి… అందిన కాడికి బంగారంతో ఉడాయించిన ఓ బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య తో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న గీత ఇటీవల భర్తను కోల్పోయింది. భర్త లెక్చరర్ గా పని చేసిన దిల్షుఖ్ నగర్ లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది. గత ఏడాది భర్త మరణించడం , కూతురు ఎంబీబీఎస్ చదువుతుండటం… ఒకదాని వెంట ఇంకో సమస్యలు తలెత్తాయి. దీనితో ఆమె పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ సూచన మేరకు గుంటూరు కు చెందిన అరిగెల శాంభశివుడు అలియాస్ గురిజీ శివస్వామిను దిల్షుఖ్ నగర్ లో కలిసింది. బాధిత మహిళ కూతురి జాతకం బాగాలేదని… ఆమె పెళ్లి అయ్యాక ఆత్మహత్య లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందని బురిడీ బాబా బెదిరించారు. శాంతి పూజలు చేస్తే దోషం పరిహారం అవుతుందన్నారు. దీనితో భయపడిన బాధిత మహిళ బురిడీ బాబా కు మొదట 1 లక్ష 70 వేలు ముట్టజెప్పింది. ఇంకా పూజలు చేయాలనీ బెదిరిస్తూ ఆమె వద్ద నుండి 26 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటి డాక్యుమెంట్ లను తీసుకొని , పూజ పేరిట శ్రీకాళహస్తి కు తీసుకెళ్లి అక్కడ పూజ నిర్వహించాడు.
ఈ సమయంలో బాధిత మహిళ గీత తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఆమె కూతురు తిరిగి హైదరాబాద్ వచ్చాక వారి ఇంటి డాక్యుమెంట్ లను వెనక్కు తీసుకొని , వారు ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. బురిడీ బాబా హైదరాబాద్ నుండి పరారయ్యాడు. దీనితో బాధిత మహిళ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ ఝాన్సీ , డిఐ సురేష్ , ఎసై నరేష్ లు కేసు నమోదు చేసి , బురిడీ బాబా పై నిఘా పెట్టారు. ఈ నెల 12న తిరుపతి నుండి హైదరాబాద్ కు వచ్చిన శాంభశివుడు ను అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో ప్రేవేట్ ల్యాండ్ సర్వేయర్ గా పని చేసిన శాంభశివుడు అక్కడ వచ్చే డబ్బులు సరిపోక , ఈ బాబా అవతారం ఎత్తినట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుండి 20.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు తులాల బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టారని… మిగిలి బంగారం అమ్ముకున్నట్లు డీసీపీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి , రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. ప్రజలు ఇలాంటి బురిడీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.
Also Read
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Congress: “సంఘటన్ సుజన్ అభియాన్” ప్రారంభం.. సంస్థాగత ప్రక్షాళనకు కాంగ్రెస్ శ్రీకారం..
తాజావార్తలు
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!