విమానం.. ఈ పదం వింటేనే ప్రాణం వణికిపోతోంది. కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు వచ్చింది. జర్మని నుంచి పయనం అయిన విమానంకు బాంబు బెదిరింపు రావడంతో ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్పోర్ట్ కు తిరిగి వెళ్లింది విమానం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావలసిన లుఫ్తాన్స ఎయిర్ లైన్స్ LH 752 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు అలర్ట్ అయ్యారు. బెదిరింపు కాల్ పై ఆరా తీస్తున్నారు.
Lufthansa Airlines: శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానంకు బాంబు బెదిరింపు
- జర్మని నుంచి పయనం అయిన విమానంకు బాంబు బెదిరింపు
- ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్పోర్ట్ కు తిరిగి వెళ్లిన విమానం

Lufthansa Airlines