Site icon NTV Telugu

IPL 2025: కొనసాగుతున్న కోల్‌కతా vs చెన్నై మ్యాచ్‌.. స్టేడియంలో బాంబు ఉన్నట్లు మెయిల్!

Ipl 2025

Ipl 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో 57వ మ్యాచ్ ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ వార్త కలకలం సృష్టించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధికారిక ఇమెయిల్ ఐడికి గుర్తుతెలియని ఇమెయిల్ ఖాతా నుంచి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.

READ MORE: Indian Military Trains: భారతీయ ‘సైనిక రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా?

ఈ బెదిరింపు తర్వాత.. కోల్‌కతా పోలీసులు వెంటనే చర్య తీసుకున్నారు. పోలీసులు, భద్రతా సంస్థలు సంఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించాయి. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం కాంప్లెక్స్ మొత్తం హై అలర్ట్‌లో ఉంచారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ బెదిరింపు అందడంతో ప్రేక్షకులు, నిర్వాహకులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే.. ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతోందని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

READ MORE: OPPO: ఒకేసారి కొత్త ఫోన్, టాబ్లెట్, ఇయర్‌బడ్స్లను గ్లోబల్గా విడుదల చేయనున్న ఒప్పో..!

అదే సమయంలో, బాంబు స్క్వాడ్‌లు, నిఘా బృందాలను కూడా మోహరించారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఇమెయిల్‌కు వచ్చిన ఈ బెదిరింపు పోలీసులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మెయిల్ పంపిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ఈ మెయిల్ సైబర్ ట్రిక్‌లో భాగమా? లేదా ఏదైనా నిజంగానే ముప్పు పొంచి ఉందా? అనే దానిపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కి ఆ రెండు దేశాల మద్దతు..

Exit mobile version