NTV Telugu Site icon

Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..

Bjp Congress

Bjp Congress

అధికార తృణమూల్ కాంగ్రెస్ చెందిన పలువురు వ్యక్తులు ఈ రోజు తనపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని కోల్కతాలోని ఒక బీజేపీ కార్యకర్త ఆరోపించారు. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని బీజేపీ మహిళా మండల్స్ యూనిట్ అధ్యక్షురాలు సరస్వతి సర్కార్ ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల పోస్టర్లు పెడుతుండగా ఆమెపై దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. ఇకపోతే ఘటనా స్థలం నుండి వచ్చిన ఫోటోలలో శ్రీమతి సర్కార్ తన తలను పట్టుకుని, ఆమె ముఖం మీద రక్తం వస్తు నొప్పితో ఏడుస్తున్నట్లు చూపించాయి. దాడి వెనుక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కోల్కతా లోక్సభ అభ్యర్థి దేబశ్రీ చౌదరి నేతృత్వంలోని స్థానిక బీజేపీ ఆనందపూర్లోని పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసింది.

Also Read: Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..

మీడియాతో మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ షోతోరుప., “ఈ సంఘటన కస్బా లో చాలా ఎత్తైన భవనం బయట జరిగింది. ఇది అస్సలు డౌన్ మార్కెట్ ప్రాంతం కాదు. ఒక గుంపు వ్యక్తులు మా కార్లను వెంబడించారు. సరస్వతి సర్కార్ కారు కొంచెం ముందుకు వెళుతుండగా.., 11 మంది కార్యకర్తలతో ఆమె వెనుక ఉన్న కారును ఆపి, వారిని వాహనం నుండి బయటకు తీసి దాడి చేశారు. సరస్వతి దీనిని చూసినప్పుడు, వ్యక్తులు దాడి చేసినప్పుడు ఆమె వారిని నివారించేందుకు పరిగెత్తింది. దాంతో ఈ ఘటనలో ఆమెకు దెబ్బలు తగిలాయి. దాంతో తలపై ఆమెకు 5 కుట్లు పడ్డాయి.

Also Read: Google layoffs: మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించిన గూగుల్…

ఆమె రక్తస్రావం అవుతుండగా ఆనందపూర్ పోలీస్ స్టేషన్ కు 50-60 మీటర్లు నడిచి వెళ్లింది. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కార్యకర్తలు కోరగా.. కానీ హత్యాయత్నం వంటి పెద్ద అభియోగాలను దాఖలు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆమె చెప్పారు. అయితే, ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని, ఇది స్థానిక సమస్య కావచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.