బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.. ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. రీసెంట్ గా ప్రేమించిన వాడితో నిశ్చితార్థం చేసుకుంది.. తాజాగా తనకు కాబోయే భర్త గురించి సంచలన విషయాలను బయటపెట్టింది..
హౌస్ లో బాగానే రాణించిన కూడా విన్నర్ రేసులో నిల్వలేక పోయింది..ఇక బయటకు వచ్చిన ఈ అమ్మడు మళ్లీ సీరియల్స్ తో బిజీ అయ్యింది.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది.. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. తనకు కాబోయే భర్త విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది..
వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అంటున్నారు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. పైగా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ తో నిశ్చితార్థం అయ్యేవరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు.. ఇప్పుడిప్పుడే సేవింగ్స్ చేస్తున్నాం.. ఇద్దరం కలిసే సహజీవనం చేస్తున్నాం.. ఒకే ఇంటిలో ఉంటూ డబ్బులు సేవ్ చేస్తున్నాము. నేను షూటింగ్ నుండి ఇంటికి రాగానే పలకరించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపించేది. ఆ బాధ నాకు తెలుసు. విజయ్ కార్తీక్ నాకు డోర్ తీసి వెల్కమ్ చెబుతాడు.. ఇక సొంతిల్లు కోనేవరకు పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పేసింది.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..