కొత్తగూడెం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బయలుదేరారు. ఆయనతో పాటు.. మంత్రులు కోమటిరడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉదయం 11-00గంటలకు రూ.4కోట్ల రూపాయల DMFT నిధులతో బైపాస్ రోడ్డు నుంచి జివి మాల్ వరకు చేపట్టనున్న డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన చేయనున్నారు. అంనతరం 11.30 గంటలకు అమృత్ 2.0 గ్రాంటు రూ.124.48కోట్ల నిధులతో కొత్తగూడెం, పోస్టాఫీసు సెంటర్ లో చేపట్టనున్న వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీం పనులకు రాష్ట్ర మంత్రులచే శంకుస్థాపన చేపట్టనున్నారు. శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. గత మూడు రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేటి ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా.. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇతర రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్రమంత్రులతో మూడు రోజుల పాటు భేటీ అయ్యారు.