NTV Telugu Site icon

Tulasi In Milk : తులసి ఆకుల పాలు తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లా కరుగుతాయి

New Project (3)

New Project (3)

Tulasi In Milk : పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే.. పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. పాల వల్ల కలిగే ప్రయోజనాలకు మరింత మెరుగుపరిచేందుకు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆకులను తీసుకుంటే శరీరాన్ని ఇంకా మేలు జరుగుతుంది.

పాలను సంపూర్ణ ఆహారం అని మాత్రమే అంటారు. ఇందులో మన శరీరానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు పాలలో మెండుగా లభిస్తాయి. ఇంకా పాలను తీసుకుంటే శరీరానికి కలిగే ఫలితాలను పెంచుకోవడానికి వాటిలో కొంచెం తులసి ఆకులను వాడవచ్చు. తులసి భారతదేశంలోని చాలా ఇళ్లలో కనిపిస్తుంది. తులసి ఆకులను మరిగించి పాలలో కలిపి తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని భారతదేశంలోని ప్రముఖ పోషకాహార నిపుణుడు తెలిపారు.

Read Also: Yuvraj Singh : సూరీడు మళ్లీ చెలరేగుతాడు.. వరల్డ్ కప్ లో అతనిదే కీలక పాత్ర..

తులసి ఆకులను పాలలో మరిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
– ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, దీనిని నివారించడానికి తులసి ఆకులను పాలలో వేసి మరిగించి త్రాగాలి. ఇలా చేయడం వల్ల ఆస్తమా రోగికి చాలా ఉపశమనం లభిస్తుంది.

– ప్రస్తుతం మైగ్రేన్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని కారణంగా ప్రజలు తరచుగా తలనొప్పితో బాధపడుతున్నారు. తులసి, పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యను నయం చేయవచ్చు.

– బిజీ లైఫ్ స్టైల్, ఆఫీసు పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ప్రేమ, స్నేహంలో మోసం, అప్పులు తరచుగా డిప్రెషన్‌కు లోన్ చేస్తుంటాయి. అటువంటప్పుడు, తులసి పాలు తీసుకోవడం అన్ని రకాల ఆందోళనలను తొలగిస్తుంది.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

– ప్రస్తుతం కలుషిత ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. అలాంటప్పుడు తులసి ఆకులను పాలలో మరిగించి తాగాలి. ఇది కిడ్నీలో రాళ్ల నొప్పుల సమస్యను దూరం చేస్తుంది.