NTV Telugu Site icon

India Squad For Zimbabwe : జింబాబ్వే టూర్కు టీమ్ని ప్రకటించిన బిసిసిఐ.. తెలుగోడికి చోటు..

Teamind

Teamind

India Squad For Zimbabwe : జులై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, సీనియర్ బౌలర్ బుమ్రాలు అందరూ ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో భాగంగా బిజీగా ఉండడంతో వారికి విశ్రాంతిని ఇచ్చింది బీసీసీఐ.

Amrapali: రేవంత్ సర్కార్‌లో కీలక అధికారిగా ఆమ్రపాలి.. ఒకేసారి 5 పోస్టులు!

జులై 6న మొదటి టి20 మొదటి మ్యాచ్ జరగనుండగా జూలై 14న 5వ టి20 తో సీరియస్ ముగుస్తుంది. ఈ సిరీస్ గాను తాజాగా బీసీసీఐ టీంను ప్రకటించింది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు శుభమన్ గిల్ సారధ్య బాధితులు నిర్వహించనున్నాడు. ఇక ఈ లిస్టులో ఐపీఎల్ లో సత్తా చాటిన తెలుగు ఆటగాడు అభిషేక్ శర్మతోపాటు, పరాగ్ లకు చోటును కల్పించారు.

Viral Video: బుద్ధుండక్కర్లే.. చదువుకోమని బడికి వెళ్ళమంటే నడిరోడ్డుపై ఆ పనులేంటి..

ఇక ప్రకటించిన ఆటగాళ్ల వివరాలు చూస్తే.. శుభమన్ గిల్ (C), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (W), ధృవ్ జురెల్ (W), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలు ఉన్నారు.