Lockdown: లాక్ డౌన్ వచ్చేసింది.. ఉదయం 9 నుంచి 4 గంటల వరకే ఆఫీస్లు..
- తీవ్ర సంక్షోభంలో బంగ్లాదేశ్..
- లాక్ డౌన్ విధించిన వైనం..
- ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఆఫీస్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే బంగ్లాదేశ్ వంటి దేశాలు తీవ్రమైన ‘ఎనర్జీ క్రైసిస్’ను ఎదుర్కొంటున్నాయి. డాలర్ల నిల్వలు తగ్గడం, చమురు ధరలు పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర పొదుపు మంత్రాన్ని పఠిస్తోంది.
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 95 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ కష్టకాలంలో పొరుగు దేశం భారత్ వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పటికే బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు సుమారు 5 వేల టన్నుల డీజిల్ను భారత్ అదనంగా సరఫరా చేసింది. కేవలం బంగ్లాదేశే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇంధన సాయం కోసం భారత్ వైపు చూస్తుండటం గమనార్హం. ఇది దక్షిణాసియాలో భారత్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
Also Read
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
- Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
విద్యుత్ ఆదా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఇకపై ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4 గంటలకే ముగియాలి. అంటే ఒక గంట ముందే పని ముగించుకుని ఇంటికి వెళ్లడం ద్వారా ఏసీలు, లైట్ల వినియోగం తగ్గుతుందని అంచనా. బ్యాంకులు కూడా మధ్యాహ్నం 3 గంటలకే కస్టమర్ సేవలను ఆపివేసి, 4 గంటల కల్లా మూతబడనున్నాయి.
Also Read:War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రభుత్వం తన బడ్జెట్లో కోతలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విద్యుత్, ఇంధన బడ్జెట్లో 30 శాతం తగ్గించాలని ఆదేశించింది. అలాగే.. విలాసవంతమైన ఖర్చులకు చెక్ పెడుతూ కొత్తగా కార్లు, విమానాలు లేదా నౌకల కొనుగోలును పూర్తిగా నిషేధించింది. వేడుకల్లో రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణపై కూడా ఆంక్షలు విధించారు.
మార్కెట్లపై ఆంక్షలు..
సాధారణ ప్రజల జీవనశైలిలో కూడా మార్పులు వచ్చేలా షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ సెంటర్లు, మందుల షాపులు, అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. సుమారు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్, తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతున్న తరుణంలో.. భారత్ అందిస్తున్న డీజిల్ సరఫరా ఆ దేశానికి పెద్ద ఊరటనిస్తోంది.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!