Lockdown: లాక్ డౌన్ వచ్చేసింది.. ఉదయం 9 నుంచి 4 గంటల వరకే ఆఫీస్లు..
- తీవ్ర సంక్షోభంలో బంగ్లాదేశ్..
- లాక్ డౌన్ విధించిన వైనం..
- ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఆఫీస్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే బంగ్లాదేశ్ వంటి దేశాలు తీవ్రమైన ‘ఎనర్జీ క్రైసిస్’ను ఎదుర్కొంటున్నాయి. డాలర్ల నిల్వలు తగ్గడం, చమురు ధరలు పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర పొదుపు మంత్రాన్ని పఠిస్తోంది.
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 95 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ కష్టకాలంలో పొరుగు దేశం భారత్ వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పటికే బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు సుమారు 5 వేల టన్నుల డీజిల్ను భారత్ అదనంగా సరఫరా చేసింది. కేవలం బంగ్లాదేశే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇంధన సాయం కోసం భారత్ వైపు చూస్తుండటం గమనార్హం. ఇది దక్షిణాసియాలో భారత్ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
విద్యుత్ ఆదా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఇకపై ఉదయం 9 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4 గంటలకే ముగియాలి. అంటే ఒక గంట ముందే పని ముగించుకుని ఇంటికి వెళ్లడం ద్వారా ఏసీలు, లైట్ల వినియోగం తగ్గుతుందని అంచనా. బ్యాంకులు కూడా మధ్యాహ్నం 3 గంటలకే కస్టమర్ సేవలను ఆపివేసి, 4 గంటల కల్లా మూతబడనున్నాయి.
Also Read:War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రభుత్వం తన బడ్జెట్లో కోతలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విద్యుత్, ఇంధన బడ్జెట్లో 30 శాతం తగ్గించాలని ఆదేశించింది. అలాగే.. విలాసవంతమైన ఖర్చులకు చెక్ పెడుతూ కొత్తగా కార్లు, విమానాలు లేదా నౌకల కొనుగోలును పూర్తిగా నిషేధించింది. వేడుకల్లో రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణపై కూడా ఆంక్షలు విధించారు.
మార్కెట్లపై ఆంక్షలు..
సాధారణ ప్రజల జీవనశైలిలో కూడా మార్పులు వచ్చేలా షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ సెంటర్లు, మందుల షాపులు, అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. సుమారు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్, తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోరుతున్న తరుణంలో.. భారత్ అందిస్తున్న డీజిల్ సరఫరా ఆ దేశానికి పెద్ద ఊరటనిస్తోంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!