Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Criticises Congress Brs Godavari Krishna Water Dispute

Bandi Sanjay: నదీ జలాల విషయంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా!

Published Date :January 8, 2026 , 12:56 pm
By RAMAKRISHNA KENCHE
Bandi Sanjay: నదీ జలాల విషయంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది.. ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాజాగా ఆయన ఇరిగేషన్ అంశంపై మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ విషయంలో అసెంబ్లీ వేదికగా‌ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. మేము నది జలాలపై కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అండగా‌ ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తామే ప్రారంభించామని కాంగ్రెస్ అంటోంది.. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి పేరు ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇది మరణశాసనం… వాళ్లే జాతీయ హోదా ఇవ్వలేదు అని లొల్లి చేస్తూన్నారన్నారు. రీ ఆర్గనైజ్ యాక్ట్ లో 6 ప్రాజెక్ట్ లు మాత్రమే ఉన్నాయి.. పునర్విభజన చట్టంలో లేని పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఎలా ఇస్తారు..? అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందన్నారు..

READ MORE: Jana nayagan- Vaa vathiy ‘జన నాయగన్’ అవుట్ తో..కార్తీకి గోల్డెన్ ఛాన్స్?

పోతిరెడ్డిపాడు విషయంలో ఆ రెండు పార్టీలు నోరు మెదపలేదు. కేసీఆర్ ప్రకటనలకు పరిమితం అయ్యారని బండి సంజయ్ అన్నారు.. “కృష్ణా నది మీ జాగీరా… అణు బాంబు అయితా అన్నాడు కేసీఆర్.. అణుబాంబు కాదు తోక పటాక్ కూడా కాలేదు. ఉమాభారతి సమక్షంలో జరిగిన మీటింగ్ లో 299 TMCలు కృష్ణా నదిలో వాటా చాలు అన్నారు. దానికి కేసీఆర్ వద్ద సమాచారం లేదు. తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం చేసింది కేసీఆర్… ఈ విషయాన్ని నేనే బయట పెట్టాను.. వెంటనే నేను అన్నది తప్పు అన్నారు కేసీఆర్… ఆంధ్ర వాళ్ళతో కమిట్ అయ్యి.. ఇక్కడ ఉల్టా డైలాగులు కొట్టారు. కాళేశ్వరం అని రూ. లక్ష కోట్లు మింగి కూలేశ్వరం కట్టారు. రెండవ దఫాలో కృష్ణా మీద కన్నేసి.. పాలమూరు రంగారెడ్డి కి సిద్ధమయ్యారు. రూ. 80వేల కోట్ల అంచనాతో మొదలు పెట్టి రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇరవై ఏడువేల కోట్లు పెడితే చుక్క నీరు రాలేదు. లిఫ్ట్‌లు రిజర్వాయర్ల కోసం రూ. 80 వేల కోట్లు అని.. ఓ అంచనా లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఖర్చు అయి ఉంటాయి అన్నారు. కృష్ణా జలాల విషయంలో 2016, 2020 లో రెండుసార్లు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మొదటిసారి మిస్టేక్ అనుకుందాం… రెండోసారి మీటింగ్ 2020 లో జరిగింది… అప్పుడైనా సరిదిద్దుకోవాలి కదా.. ఆ మీటింగ్ లో కూడా 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు.. జగన్ ప్రగతి భవన్ కి వచ్చారు.. ఇద్దరూ కలిసిన విషయం ఫార్మాలిటీ అన్నారు.. ఆనాడు నేను ప్రశ్నిస్తే నన్ను విమర్శించారు. వెంటనే బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల జరుగుతుంటే ఆపలేదు. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర చేపల పులుసు తిని వచ్చారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి.. పెద్దన్న పాత్ర పోషిస్తా అన్నారు. కవిత కూడా ఆ రోజు పట్టుబట్టలు పెట్టారు. ఆరోజు జరిగిన సమావేశంలో ఏమి జరిగిందో కవిత బయటపెట్టాలి.. బీజేపీ అండ ఉంది. కవిత దావత్ వద్దన్నదని నాకు సమాచారం ఉంది… ఇప్పుడు చెప్పాలి… రోజా ఇంట్లో నాన్ వెజ్ తిని తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో అన్యాయాన్ని నిరసిస్తూ మేము ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేశాం..” అని సంజయ్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandi Sanjay comments
  • BJP Telangana News
  • Congress BRS political drama
  • Godavari Krishna river issue
  • KCR irrigation controversy

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions