టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..
ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను 24న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా బాలయ్య రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్లోని ఐటీసీ కోహెనూర్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. కాజల్ తో భగవంత్ కేసరి సినిమా చేశారు బాలయ్య.. బాలయ్య రాబోతుండటంతో ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 31 ప్రేక్షకుల ముందుకు రానుంది..
‘𝐆𝐨𝐝 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ 🦁 for ‘𝐐𝐮𝐞𝐞𝐧 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬’ 👸❤️🔥
Get ready to witness the ROAR of #NandamuriBalaKrishna Garu as he is all set to grace the Grand Trailer Launch Event of #Satyabhama 🔥❤️🔥
Mark your calendars ✅
🗓️ 24th May
🕡 6:30… pic.twitter.com/9st4E2KdF8— GSK Media (@GskMedia_PR) May 22, 2024