Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!

  • ఐదో రోజుకు చేరిన బహదూర్ గూడ రైతుల నిరసన..
  • బహదూర్ గూడ రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ
  • శంషాబాద్ మండలంలో భారీగా చేరుకున్న హైడ్రా ఆధికారులు
  • శంషాబాద్ మండలంలోని బహుద్దుర్‌గుడా భూముల వద్దకు చేరుకున్న హైడ్రా టీం
  • బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు
  • గత ఆరు రోజులుగా రైతుల అందోళన.
  • స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత భూములు తీసుకోవాలన్న రైతులు
  • హైడ్రా అధికారులు రావడంతో బహుద్దుర్ గుడాలో హై టెన్షన్...
Bahadurguda

Bahadurguda

Bahadurguda: శంషాబాద్ బహదూర్ గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బహదూర్ గూడా భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో ఐదు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..

బహదూర్‌గూడ భూముల జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హెచ్చరించారు. హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అనుకున్నాం. కానీ మీరు బ్లాక్ మెయిలర్‌లు ప్రజలను భయపెట్టడానికి వచ్చిన హైడ్రా అంటూ విరుచుకుపడ్డారు. బహదూర్గుడా భూములపై సాటస్‌కో ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ కోర్టు అనుమతి లేకుండా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని అన్నారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో చేపట్టిన రైతు నిరసన ఐదో రోజుకు చేరింది. రైతులకు ఈరోజు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ రాజేందర్ నగర్ ఇంచార్జ్ పట్ల కార్తీక్ రెడ్డి నిలబడ్డారు. బహదూర్ గూడ లోని వ్యవసాయ పొలాలని తరతరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న ప్రజలకు బులెట్ ట్రైన్ పేరుతో లాక్కోవాలని చూస్తుంది. కానీ ముమ్మాటికి రైతుల పక్షాన ఉండి పోరాడుతాం, ఎక్కడికైనా వెళతాం కానీ రైతుల భూములను లాక్కునే ప్రసక్తి లేదంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

భూముల రైతులను పిలిచి బెదిరించి భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రానున్న 2 సంవత్సరాల్లో కెసిఆర్ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి బహదూర్ గూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దని అందరికీ కెసిఆర్ చేతుల మీదుగా పట్టా, పాసు పుస్తకాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.