Sexual Assault : ఒలింపిక్ సన్నాహకాల మధ్య పారిస్లో ఆస్ట్రేలియా మహిళ పై సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sexual Assault : పారిస్లో జూలై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించింది. 25 ఏళ్ల ఆస్ట్రేలియన్ యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు రావడంతో ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెంట్రల్ ప్యారిస్లోని పిగల్లే జిల్లాలో తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. మహిళ సమీపంలోని కబాబ్ షాప్లో ఆశ్రయం పొందింది. బాధతో, ఆమె బట్టలు పాక్షికంగా చిరిగిపోయి, సహాయం కోసం కాల్ చేయడానికి రెస్టారెంట్ సిబ్బందిని అభ్యర్థించింది. ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే ప్రాసిక్యూటర్లు ఈ కేసును “గ్యాంగ్ రేప్”గా అభివర్ణించారు. దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Also:Balayya : నందమూరి మోక్షజ్న మెకోవర్ వీడియో..నెట్టింట వైరల్.!
Also Read
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
పారిస్లో 2024 ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు హాజరయ్యే హై-ప్రొఫైల్ అంతర్జాతీయ ఈవెంట్ సందర్భంగా నగరంలో భద్రతపై ఆందోళనలు లేవనెత్తారు. అత్యాచారం ఆరోపణల తర్వాత అగ్నిమాపక సిబ్బంది మహిళకు చికిత్స అందించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం బిచాట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫ్రెంచ్ వార్తాపత్రిక లే పారిసియన్ ప్రకారం. ప్యారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం.. మహిళ చేసిన ఆరోపణలపై చట్ట అమలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారని చెప్పారు.
Read Also:Bangladesh Protest : మమతా బెనర్జీ పై షేక్ హసీనా ప్రభుత్వం భారత సర్కార్కు ఫిర్యాదు
జూలై 19 నుంచి 20వ తేదీ రాత్రి జరిగిన సామూహిక అత్యాచారం ఆరోపణలపై విచారణను రెండో జ్యుడీషియల్ పోలీస్ జిల్లాకు అప్పగించినట్లు పేర్కొంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్కు ముందు పారిస్ భద్రతా చర్యలను పెంచిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల భద్రతను నిర్ధారించడానికి నగరం అంతటా గణనీయమైన పోలీసు బలగాలను మోహరించారు. సీన్ నదితో సహా కీలకమైన ప్రాంతాల్లో సాయుధ అధికారులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈఫిల్ టవర్ వంటి ప్రసిద్ధ ప్రదేశాల చుట్టూ భద్రతను పెంచారు. ఇక్కడికి చేరుకోవాలంటే పోలీసులు జారీ చేసే ప్రత్యేక అనుమతి పత్రం అవసరం. ఒలింపిక్స్ కు వేల మంది అథ్లెట్లు, మిలియన్ల మంది ప్రేక్షకులు వస్తున్నందున్న ఆతిథ్య దేశం భద్రతను కట్టుదిట్టం చేయాలని పలువురు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!