Fastest Half Century: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన భారత ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashutosh Sharma hits Fastest T20 Half Century in Balls: 16 ఏళ్ల కిందట టీ20ల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది. రైల్వేస్ బ్యాటర్ అశుతోష్ శర్మ 11 బంతుల్లోనే అర్ధ శతకం చేసి యువీ రికార్డును బ్రేక్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ సిలో అరుణాచల్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో అశుతోష్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ జట్టు తరఫున బరిలోకి దిగిన అశుతోష్ శర్మ.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి బంతి నుంచే బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 11 బంతుల్లో 8 సిక్సులు, 1 ఫోర్ సహాయంతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 441.66. దీంతో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం అశుతోష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఇక ఆసియా గేమ్స్ 2023 ముందువరకు ప్రపంచ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ యువరాజ్ సింగ్ పేరునే ఉంది. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్ దీపెంద్ర సింగ్ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువీ రికార్డు బ్రేక్ చేశాడు. 9 బంతుల్లో 8 సిక్సర్లు బాదడం విశేషం. ఆ మ్యాచ్లో దీపేంద్ర సింగ్ 10 బంతుల్లో 520 స్ట్రైక్రేట్తో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే మ్యాచ్లో అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా నమోదైంది. నేపాల్ బ్యాటర్గా కుశాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 127 పరుగుల తేడాతో రైల్వేస్ ఘన విజయం సాధించింది. అశుతోష్ శర్మ సహా ఉపేంద్ర యాదవ్ (103 నాటౌట్; 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లు) సెంచరీ బాదడంతో రైల్వేస్ 246/5తో ఇన్నింగ్స్ను ముగించింది. చివరి ఐదు ఓవర్లలో రైల్వేస్ 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 119 పరుగులకే ఆలౌటైంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!