Arvind Kejriwal: పెరిగిన షుగర్ లెవెల్స్.. కేజ్రీవాల్కు తీహార్ జైలులో ఇన్సులిన్!
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయి పెరిగి 320కి చేరుకోవడంతో సోమవారం రాత్రి తీహార్ జైలులో ఇన్సులిన్ను అందించారు. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ తీహాల్ జైలు పరిపాలన తనకు ఇన్సులిన్ అందించడం లేదని ఆప్ అధినేత నిన్న ఆరోపించారు. టైప్-2 డయాబెటిస్ రోగి అయినఅరవింద్ కేజ్రీవాల్కు షుగర్ స్థాయి 320కి పెరగడంతో తీహార్ జైలులో ఇన్సులిన్ అందించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు మంగళవారం తెలిపాయి. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రికి ఇది మొదటి ఇన్సులిన్ డోసేజ్ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే షుగర్ లెవల్ 200 దాటినప్పుడు లో డోసులో ఇన్సులిన్ ఇవ్వవచ్చు అని ఎయిమ్స్ వైద్యుల బృందం పేర్కొన్న విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ను చంపాలన్న కుట్రలో బీజేపీ ఉన్నట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కావాలని జైలు అధికారులు కేజ్రీవాల్కు చికిత్సను ఇవ్వడం లేదని సంజయ్ పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి చెప్పినది నిజమేనని, ఆయనకు ఇన్సులిన్ అవసరమని ఈరోజు స్పష్టమైంది. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆయనకు చికిత్స చేయడం లేదు. చెప్పండి బీజేపీ వాళ్లు! ఇన్సులిన్ అవసరం లేకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ప్రపంచం మొత్తం వారిని శపిస్తోంది’ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
- KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
అర్వింద్ కేజ్రీవాల్ వైద్య అవసరాలను, ముఖ్యంగా ఇన్సులిన్కు సంబంధించి అంచనా వేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సిటీ కోర్టు ఎయిమ్స్ను ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారం, డాక్టర్ సూచించిన ఆహారంతో కూడిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆహార నియమావళి మధ్య వ్యత్యాసాలను కోర్టు హైలైట్ చేసింది.సోమవారం తీహార్ జైలు సూపరింటెండెంట్కు రాసిన లేఖలో, డాక్టర్లతో తన సంప్రదింపులలో ఇన్సులిన్ సమస్యను తాను ఎప్పుడూ లేవనెత్తలేదన్న జైలు పరిపాలన వాదనను కేజ్రీవాల్ తిరస్కరించారు. కేజ్రీవాల్ 10 రోజుల వ్యవధిలో ఇన్సులిన్ డిమాండ్ సమస్యను నిరంతరం లేవనెత్తారని నొక్కి చెప్పారు.
కేజ్రీవాల్కు హాని కలిగించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ, పార్టీ అధినేతకు ఇన్సులిన్ నిరాకరించడం ద్వారా తీహార్ జైలు పరిపాలన చంపేందుకు కుట్ర పన్నిందని ఆప్ ఆరోపించింది. సోమవారం, కేజ్రీవాల్ తీహార్ సూపరింటెండెంట్కు రాసిన లేఖలో, తన గ్లూకోజ్ మీటర్ రీడింగ్ 250 నుంచి 320 మధ్య ప్రమాదకరమైన పరిధిని కలిగి ఉన్నందున ఇన్సులిన్ కోసం అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జైలు యంత్రాంగం తన ఆరోగ్యంపై అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. కేజ్రీవాల్ తన రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి, వైద్యపరమైన బెయిల్కు కారణమయ్యే ప్రయత్నంలో ప్రతిరోజూ మామిడిపండ్లు, ఆలూ పూరీ, స్వీట్లు తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత వారం ఆరోపించిన తర్వాత ఇన్సులిన్ వివాదం మరింత పెరిగింది.జైల్లో మూడుసార్లు మామిడిపండ్లు మాత్రమే ఉన్నాయని, నవరాత్రి ప్రసాదంగా ఆలూ పూరీని తినేవాడని ఆయన న్యాయవాది ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ప్రజల్లో సానుభూతి చూపడమే ఆప్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
-
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!