Site icon NTV Telugu

Indian Navy Recruitment 2025: 10th, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో జాబ్స్.. మంచి జీతం

Jobs

Jobs

ఇండియన్ నేవీ SSC ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ నేవీలో SSC ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుతో కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి (కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్) వంటి సబ్జెక్టులలో MSc, BE, BTech లేదా MTech చేసి ఉండాలి.

Also Read:Donald Trump: భారత్‌కు పిడుగులాంటి వార్త! టారిఫ్‌లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!

లేదా (కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సబ్జెక్టులో BCA లేదా B.Sc విత్ MCA చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్‌ఎస్‌సి ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, జనవరి 02, 2001 నుంచి జూలై 01, 2006 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 జీతం అందిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17, 2025 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version