Site icon NTV Telugu

AP High Court: సీఎస్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి ఏపీ హైకోర్టు నోటీసులు

Ap High Court

Ap High Court

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా.. రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్న విషయాన్ని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అంతేకాకుండా.. కాల్ రికార్డ్స్ ను కూడా కోర్టుకు అందించాడు. ఈ క్రమంలో.. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Exit mobile version