NTV Telugu Site icon

AP High Court: మాజీ మంత్రి బాలినేని పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..

Balineni

Balineni

మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డి వేసిన పిల్‌పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. బాలినేని పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గత ఎన్నికల సమయంలో ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అవకతవక జరిగాయంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో పిల్‌ వేశారు. ఈ క్రమంలో.. హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని. అంతేకాకుండా.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద వాదనలు వినిపించారు. ఆ తర్వాత.. ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు. తాజాగా.. తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. కాగా.. గతంలో వైసీపీలో ఉన్న మాజీమంత్రి బాలినేని.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.