Site icon NTV Telugu

Cm Jaganmohan Reddy: సీఎం జగన్ ట్వీట్.. అంతా ఆనందంగా ఉండాలి

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుసంపన్నంగా, సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌..
`ప్ర‌జ‌లంద‌రికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీరు నాపై చూపిన ప్రేమ, మద్దతు, నమ్మకానికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు` తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

 

Exit mobile version