Yanamala Ramakrishnudu: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, ఈ బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. కూటమి పార్టీలు బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం.. విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఏపీ బడ్జెట్ 2026-27పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు ప్రజా ఆకాంక్షలను తీరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారని యనమల అన్నారు. రుణాల నియంత్రణకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు.
Read Also: Indian Army Agniveer 2026: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఇక, రుణాల రీ-షెడ్యూలింగ్, వడ్డీ భారాన్ని తగ్గించే చర్యలు రాష్ట్రాన్ని అప్పుల భారంనుంచి బయటపడేయడానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు యనమల.. అలాగే బడ్జెట్లో పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం సానుకూల పరిణామమని చెప్పారు. సామాజిక న్యాయం దిశగా బడ్జెట్ రూపొందించడం కూడా అభినందనీయమని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు..
