Tollywood : నిర్మాతగా మారిన మరొక స్టార్ హీరోయిన్.. కీయురి ప్రొడక్షన్స్ పేరిట బ్యానర్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించి ఎన్నో సూపర్ సినిమాలలో నటించి మెప్పించిన నటి నిత్యా మీనన్. కొంత కాలంగా సినిమాలు కాస్త తగ్గించిన నిత్యా ఇప్పుడు మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. కేవలం నటిగానే కాకుండా, తన అభిరుచికి తగ్గ కథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ఆమె నిర్మాతగా మారింది. గడచిన మంగళవారం తన సొంత నిర్మాణ సంస్థ ‘కీయురి ప్రొడక్షన్స్’ (Keyuri Productions) లోగో వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
Also Read : Vishwak Sen : మరొక ఫ్లాప్ దర్శకుడితో విశ్వక్ సేన్..
Also Read
ఈ సందర్భంగా నిత్యా మీనన్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. “నాకు సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదు.. అది చూసేవారిలో, చేసేవారిలో ఒక మార్పును తీసుకురావాలి. నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే బాధ్యతను కొనసాగిస్తాను” అని ఆమె తెలిపారు. ‘కీయురి’ అంటే భూమి గుహల నుంచి పుట్టి, కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె వీడియోలో వివరించారు. నిర్మాతగా మారిన ఈ శుభ సందర్భంలో, తన తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’ విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న జ్ఞాపకాలను నిత్యా గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఒక చిన్న సినిమాగా మొదలైన ఆ ప్రయాణం తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతానికి కీయురి ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రకటించలేదు. నిత్యా మీనన్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న నటన సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత, తన బ్యానర్లో వైవిధ్యమైన సినిమాలను పట్టాలెక్కించనున్నారు.
- Tags
తాజావార్తలు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!