Site icon NTV Telugu

AP Weather Alert: ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Apweather

Apweather

​AP Weather Alert: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావారణ శాఖ సూచించారు. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బయట తిరగకుండా సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని హెచ్చరించారు.

READ MORE: SSB Constable Recruitment 2026: సశస్త్ర సీమా బల్ (SSB)లో కానిస్టేబుల్ పోస్టులు.. 10th, ఇంటర్ పాసైతే మిస్ చేసుకోకండి

Exit mobile version