NTV Telugu Site icon

Anchor Geetha : స్టేజ్ పైనే రచ్చ రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్..

Geethaa

Geethaa

ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు వినిపిస్తున్నాయి.. అవే ఈవెంట్ ను సక్సెస్ చేస్తున్నాయి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో తాజాగా ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది..

ఈ ఈవెంట్ కి గీతా భగత్ యాంకర్ గా వ్యవహరించగా, స్టేజి పై రచ్చ రవి మాట్లాడుతూ.. డబుల్ మీనింగ్ డైలాగ్‌ వదిలారు.. దానికి స్పందించిన గీతా వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే కౌంటర్ ఇచ్చింది.. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

యాంకర్ గీతాతో రచ్చ రవి మాట్లాడుతూ.. ‘ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది’ అంటూ కామెంట్ చేశారు. దానికి గీతా షాక్ అయ్యారు. అయితే మాటల్లో కొంచెం గ్యాప్ ఇచ్చిన రవి.. ‘నీ మనసు మాయమయి నా దగ్గరకు వచ్చేసింది.. దానికి వెంటనే స్పందించిన గీతా నువ్వు గ్యాప్ ఇవ్వకు.. ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది. నీ బుర్ర నీ నుంచి మాయం అయ్యింది’ అంటూ స్టేజి పైనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..