Anantnag-Rajouri: చరిత్ర సృష్టించిన అనంత్నాగ్-రాజౌరీ పోలింగ్.. 35 ఏళ్లలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ పోలింగ్ చరిత్ర సృష్టించింది. గత 35 ఏళ్లలో లేనంతగా ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 51.35 శాతం ఓటింగ్ నమోదు చేసిందని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ ట్విట్టర్లో తెలిపింది. దీనితో కాశ్మీర్ లోయలోని మూడు పోలింగ్ కేంద్రాలు అత్యధిక ఓటింగ్ను నమోదు చేశాయని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
అనంత్నాగ్-రాజౌరీ స్థానం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆమె ఆందోళన కూడా చేశారు. పూంచ్ జిల్లాలో ఇరుపార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Skoda: త్వరలో కొత్త మోడళ్లతో భారత్ మార్కెట్లోకి స్కోడా..
ఇక ఆరో విడతలో భాగంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు దాదాపు 57.70 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 77.99 శాతం, అత్యల్పంగా ఉత్తర్ప్రదేశ్లో 52.02 శాతం ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 53.75 పోలింగ్ నమోదైంది. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.

తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!