ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు రాష్ట్రాలోని వాళ్ళకు మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రజలకు కూడా సుపరిచితమే..గతంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్పాట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు..
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్..ఇక ఈ సినిమా ఆగస్టు 15 ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. ఇక ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాల ను లైనప్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
అట్లీ కథను సిద్ధం చేస్తున్నాడనే లీక్స్ బలంగా ఇచ్చినా ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్ రాలేదు. కథ విషయంలో ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుసుకుంది.. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి అల్లు అర్జున్ తో చేయబోతున్న మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.. అయితే ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ ఎప్పటిలాగా కాకుండా, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ని పక్కనపెట్టి ఈసారి త్రివిక్రమ్ ఫాంటసీ టచ్ ఉన్న భారీ సబ్జెక్టుని రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.. దీనిపై జూలై లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..