Site icon NTV Telugu

Vishakha Yadav: అరుణాచల్‌లో పీఎం మోడీకి స్వాగతం పలికిన ఐఏఎస్ అధికారిణి.. ఎవరీ విశాఖ యాదవ్?.. తెగ వెతికేస్తున్న నెటిజన్స్

Visaklha Yadav

Visaklha Yadav

అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుం పరే జిల్లాకు చేరుకున్నారు. అక్కడ మహిళా సివిల్ సర్వీస్ అధికారిణి విశాఖ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ అధికారిణి, మోడీని పలకరిస్తున్న ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్స్ ఎవరీ విశాఖ యాదవ్ అంటూ తెగ వెతికేస్తున్నారు. విశాఖ యాదవ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రిని పలకరిస్తున్న చిత్రాలను శ్రీమతి యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాపుం పరేలో పీఎంను హృదయపూర్వకంగా స్వాగతించే అవకాశం లభించడం పట్ల గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

Ias


Also Read:US Pakistan Relations: ట్రంప్ అకస్మాత్తుగా పాకిస్థాన్ ప్రేమలో ఎందుకు పడ్డారు..? భారత మాజీ దౌత్యవేత్తల వివరణ..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ తన ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. కోచింగ్ సహాయం లేకుండానే, ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించింది. విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. IAS అధికారిణి కావడానికి ముందు, ఆమె ఒక ఇంజనీర్. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేసింది. కానీ ఆమె కల మాత్రం IAS అధికారిణి కావడమే.

Also Read:OG: ఓజీలో టైం ట్రావెల్.. చూసినోళ్లు ఇది అబ్జర్వ్ చేశారా బాసూ?

అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి, కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమైన తర్వాత, ఆమె మొదటి రెండు ప్రయత్నాలలో ఉత్తీర్ణురాలైంది, కానీ ఆమె మూడవ ప్రయత్నంలో సివిల్స్ సాధించింది. విశాఖ యాదవ్ UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు – ఇది దేశంలో ఆరవ అత్యున్నత ర్యాంక్. ఆమె చివరకు తన కలను నెరవేర్చుకుంది.
1994లో ఢిల్లీలో జన్మించింది. తండ్రి రాజ్‌కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాగా, తల్లి గృహిణి.

Exit mobile version