Akhanda 2: నిర్మాతల మిస్సింగ్.. బాలయ్య-బోయపాటి మౌనం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ శుక్రవారం రోజున అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగించుకుని థియేటర్లలో విడుదలైంది. తొలి వారాంతపు కలెక్షన్లు పర్వాలేదనిపించే స్థాయిలో ఉండగా, భారీ లక్ష్యాలను చేరుకోవాలంటే వారం రోజుల పాటు సినిమా స్ట్రాంగ్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి హైదరాబాద్లో చిత్ర యూనిట్ ‘అఖండ 2’ సక్సెస్ వేడుకను ఘనంగా నిర్వహించింది. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read :Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
‘అఖండ 2’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట మరియు గోపీ ఆచంట (14 రీల్స్ ప్లస్) సక్సెస్ మీట్కు హాజరు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అదే సమయానికి వారు శ్రీశైలంలో ఉన్నారని తెలిసింది. అయితే ఇదిలా ఉండగా ఈ వేదికపై మాట్లాడిన బాలకృష్ణ కానీ, దర్శకుడు బోయపాటి శ్రీను కానీ తమ ప్రసంగంలో నిర్మాతల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. సినిమా ఆర్థికపరమైన చిక్కుల్లో పడి, విడుదల ఆలస్యం అయినప్పటి నుంచే బాలకృష్ణ మరియు నిర్మాతల మధ్య గ్యాప్ ఏర్పడిందనే వార్తలు వినిపించాయి. సక్సెస్ మీట్లో వారిద్దరూ నిర్మాతలను విస్మరించడం ద్వారా, ఆ వార్తలు నిజమేనని స్పష్టమైంది. అంతేకాకుండా, సినిమా విడుదల తర్వాత కూడా బోయపాటి శ్రీను నిర్మాతలతో మాట్లాడటం లేదని సినీ వర్గాల సమాచారం.
Also Read :JINN Trailer : భయపెడుతున్న ‘జిన్’ ట్రైలర్
ఈ సక్సెస్ మీట్ ఖర్చుల విషయంలో కూడా నిర్మాతలతో చర్చ జరగలేదని, ఈ ఈవెంట్ను ‘మ్యాంగో రామ్’ దగ్గరుండి నిర్వహించారని కథనాలు వస్తున్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరూ వేదికపై దిల్ రాజు పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా విడుదలకు అడ్డుపడిన అన్ని అడ్డంకులను తొలగించడంలో, చిత్రాన్ని ప్రేక్షకులకు చేర్చడంలో దిల్ రాజు కీలక పాత్ర పోషించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా, ‘అఖండ 2’ విజయాన్ని చిత్ర బృందం ఘనంగా జరుపుకున్నప్పటికీ, తెర వెనుక నెలకొన్న ఈ విభేదాలు, నిర్మాతల మిస్సింగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
- Tags
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!