ఆగ్రాలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నదిలో ఏకంగా 13 మంది యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 100 గంటల ఆపరేషన్ తర్వాత ఆరు మృతదేహాలు బయటపడ్డాయి.. నీటిలో మునిగిన యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది
పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 2న దుంగర్వాలా గ్రామంలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా కనీసం 13 మంది గల్లంతయ్యారు. ఆగ్రాలోని ఉతంగన్ నది నుండి ఆరో డెడ్ బాడీని వెలికి తీశారు. చనిపోయున యువకుడిని కరణ్ గా గుర్తించారు. ఆర్మీ కొత్త ప్రణాళిక ఆదివారం ఫలించింది. భూగర్భ సబ్మెర్సిబుల్ పంపుల నుండి మృతదేహాలను తీయడానికి సహాయపడే కంప్రెసర్ను ఉపయోగించారు. ఆర్మీకి చెందిన 50 పారా బ్రిగేడ్ యూనిట్కు చెందిన 411 పారా ఫీల్డ్ కంపెనీ, NDRF, SDRF, PAC ఫ్లడ్ కంపెనీ మరియు స్థానిక డైవర్ల సంయుక్త శోధన మరియు రక్షణ ఆపరేషన్ నాల్గవ రోజుకు చేరుకుంది.
Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
“సహాయక చర్య కోసం మేము భారతదేశంలోని అత్యుత్తమ బృందాన్ని నియమించామని వెల్లడించారు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప బంగారి. సీఎం ఈ ఆపరేషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి, నది ప్రవాహాన్ని మళ్లించడానికి ఏడు ఎక్స్కవేటర్లను ఉపయోగించి సంఘటన స్థలం నుండి 200 మీటర్ల ఎగువన ఒక కాలువను తవ్వుతున్నారు. ఆ ప్రదేశంలో నీటిని నిరోధించడానికి తాత్కాలిక ఆనకట్ట నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి పంపు సెట్లను ఉపయోగిస్తున్నారు.
Few people in Agra decided to perform durga visarjan.
14 people drowned in the river, out of which 4 people were pulled out, of whom 3 died.
9 are still missing.
PS: Indian is 4th largest economy with 0 common sense.pic.twitter.com/uy02xDM7jY
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) October 3, 2025
