Site icon NTV Telugu

Dhurandhar 2 : నా బామ్మర్ది ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడు : ఆదిత్య ధర్

Aditya Dhar

Aditya Dhar

ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు దర్శకుడు ఆదిత్య ధర్. ఇక ఇటీవల వచ్చిన ధురంధర్ తో ఏకంగా పాన్ ఇండియాస్ మోస్ట్ క్రేజీయెస్ట్ డైరెక్టర్ లిస్ట్ లో చేరాడు. ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం ‘ధురంధర్’ సీక్వెల్  రిలీజ్ హడావిడిలో బిజీగా ఉన్నారు. మార్చి 19న ధురంధర్ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే, తాజాగా ఆయన తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ తమ్ముడు ఓజస్ గౌతమ్ గురించి ఆదిత్య ధర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : VIJAY : విజయ్‌ జీవితంలో ఏప్రిల్‌ మలుపు.. 20న విడాకుల తీర్పు.. 23న పోలింగ్

ఆదిత్య ధర్ మాట్లాడుతూ ‘ఓజస్ గౌతమ్ ప్రతిభపై ఆదిత్య ధర్‌కు అపారమైన నమ్మకం ఉంది. వచ్చే పదేళ్లలో, భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన  బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఓజస్ అవతరిస్తాడు, ఓజస్‌ను దేశంలోనే బెస్ట్ డైరెక్టర్‌గా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని, అందుకు తన వంతు కృషి చేస్తాను’ అని స్పష్టం చేశారు.ఒక స్టార్ డైరెక్టర్ నుండి ఇలాంటి ప్రశంసలు రావడం అంటే ఓజస్ గౌతమ్‌లో ఏదో బలమైన విషయం ఉందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ప్రస్తుతం ఆదిత్య ధర్ పర్యవేక్షణలోనే ఓజస్ మెళకువలు నేర్చుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ యంగ్ టాలెంట్ భవిష్యత్తులో తన బావ ఆదిత్య ధర్ లాగే ఇండియన్ సినిమాను ఏ స్థాయిలో ఏలుతాడో చూడాలి.

Exit mobile version