ఇటీవల రాజ్యసభలో కమల్ హాసన్ శ్రీశ్రీ రాసిన “జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్” అనే లైన్స్ చెబుతూ, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదంటూ పరోక్షంగా అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై నటి కస్తూరి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో కౌంటర్లు వేశారు. కమల్ హాసన్ చెప్పే మాటలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయని, ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్లకి కూడా అసలు ఆయన ఏం చెప్పారో అర్థం కావడం లేదని ఆమె తెలిపారు. కమల్ కేవలం మాటలతోనే మాయ చేస్తారని, తెలుగు వారి గురించి కూడా ఆయన పట్టించుకోవడం లేదన్నట్లుగా కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
Also Read : Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్లో!
గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్, కస్తూరి అన్నాచెల్లెళ్లుగా (ఫ్లాష్ బ్యాక్లో తండ్రీకూతుళ్లుగా) నటించి మెప్పించారు. వెండితెరపై అంతటి అనుబంధం ఉన్న వీరిద్దరి మధ్య ఇప్పుడు రాజకీయ వైరుధ్యం తలెత్తడం విశేషం. ప్రస్తుతం కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో కమల్ చేసిన పొలిటికల్ కామెంట్స్ పై కస్తూరి ఇచ్చిన కౌంటర్కు కమల్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ వివాదంపై కమల్ హాసన్ ఏమైనా రియాక్ట్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.
