DecibelDash 2025: ‘డెసిబెల్డాష్-2025’ పోస్టర్ ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DecibelDash 2025: ప్రముఖ నటుడు శ్రీకాంత్ ‘డెసిబెల్డాష్-2025 – రన్ ఫర్ హియరింగ్’ పోస్టర్ను మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మౌర్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMA (ఇండియన్ మెడికల్ అసోసియేషన్), AOI (అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగోలజిస్ట్స్ ఆఫ్ ఇండియా), TASLPA (తెలంగాణ ఆడియాలజిస్ట్స్ & స్పీచ్-లాంగ్వేజ్ పథాలజిస్ట్స్ అసోసియేషన్) తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వినికిడి లోపం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సమస్యగా మారింది. బాల్యంలో గుర్తించకపోతే, పిల్లలు మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఇది వారి చదువుపై, ఉద్యోగ అవకాశాలపై, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే, ఈ పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. డెసిబెల్డాష్-2025 వినికిడి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ముందుగా పరీక్షలు చేయించుకునే అవసరాన్ని తెలియజేయడానికి, సహాయానికి అవసరమైన పిల్లలకు మద్దతుగా నిర్వహించనున్నారు.
Also Read
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
Read Also:Bangladeh : అప్పుడు ప్రభుత్వాన్ని మార్చారు… ఇప్పుడు దేశాన్నే మార్చనున్న విద్యార్థులు
ఈ కార్యక్రమంలో మౌర్యా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డెసిబెల్డాష్-2025 ప్రధాన నిర్వాహకుడు, మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ కన్సల్టెంట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ మైక్రోసర్జన్ ప్రొఫెసర్ డా. శ్రీప్రకాశ్ విన్ణకోట పాల్గొన్నారు. “వినికిడి లోపాన్ని ముందుగా గుర్తించి, సరైన వైద్యం అందిస్తే, దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ప్రజల్లో అవగాహన పెరిగితే, ఈ సమస్యను అరికట్టగలం” అని తెలిపారు. డెసిబెల్డాష్-2025 కార్యదర్శి డా. అశ్విని అమరేశ్వర్ మాట్లాడుతూ.. “వినికిడి సమస్యలపై ఇంకా అపోహలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలి” అని అన్నారు.
హీరో శ్రీకాంత్, మౌర్యా ఫౌండేషన్, భాగస్వామ్య సంస్థల కృషిని ప్రశంసించారు. ప్రజలు ‘డెసిబెల్డాష్-2025’ లో పాల్గొని వినికిడి ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “ప్రతి ఒక్కరూ వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాజాన్ని శబ్ద-స్మృతిగా మార్చేందుకు సహాయపడాలి” అని సూచించారు.
Read Also:Microsoft: హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి: సీఎం
డెసిబెల్డాష్-2025 వివరాలు
ఈ వినికిడి అవగాహన పరుగులో 2K, 5K, 10K విభాగాలు ఉన్నాయి. ఇది మార్చి 2, 2025న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది.మౌర్యా ఫౌండేషన్ వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకు ఉచిత పరీక్షలు, తక్కువ ఖర్చుతో చికిత్సలు అందిస్తూ, వినికిడి ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తోంది. మరిన్ని వివరాలకు: www.decibelldash.comసంప్రదించాలి. ఈ ఉద్యమంలో భాగస్వామి అవ్వండి. వినికిడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పరుగెత్తండి!
తాజావార్తలు
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!