DecibelDash 2025: ‘డెసిబెల్డాష్-2025’ పోస్టర్ ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DecibelDash 2025: ప్రముఖ నటుడు శ్రీకాంత్ ‘డెసిబెల్డాష్-2025 – రన్ ఫర్ హియరింగ్’ పోస్టర్ను మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మౌర్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMA (ఇండియన్ మెడికల్ అసోసియేషన్), AOI (అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగోలజిస్ట్స్ ఆఫ్ ఇండియా), TASLPA (తెలంగాణ ఆడియాలజిస్ట్స్ & స్పీచ్-లాంగ్వేజ్ పథాలజిస్ట్స్ అసోసియేషన్) తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వినికిడి లోపం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సమస్యగా మారింది. బాల్యంలో గుర్తించకపోతే, పిల్లలు మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఇది వారి చదువుపై, ఉద్యోగ అవకాశాలపై, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే, ఈ పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. డెసిబెల్డాష్-2025 వినికిడి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ముందుగా పరీక్షలు చేయించుకునే అవసరాన్ని తెలియజేయడానికి, సహాయానికి అవసరమైన పిల్లలకు మద్దతుగా నిర్వహించనున్నారు.
Also Read
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Read Also:Bangladeh : అప్పుడు ప్రభుత్వాన్ని మార్చారు… ఇప్పుడు దేశాన్నే మార్చనున్న విద్యార్థులు
ఈ కార్యక్రమంలో మౌర్యా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డెసిబెల్డాష్-2025 ప్రధాన నిర్వాహకుడు, మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ కన్సల్టెంట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ మైక్రోసర్జన్ ప్రొఫెసర్ డా. శ్రీప్రకాశ్ విన్ణకోట పాల్గొన్నారు. “వినికిడి లోపాన్ని ముందుగా గుర్తించి, సరైన వైద్యం అందిస్తే, దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ప్రజల్లో అవగాహన పెరిగితే, ఈ సమస్యను అరికట్టగలం” అని తెలిపారు. డెసిబెల్డాష్-2025 కార్యదర్శి డా. అశ్విని అమరేశ్వర్ మాట్లాడుతూ.. “వినికిడి సమస్యలపై ఇంకా అపోహలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలి” అని అన్నారు.
హీరో శ్రీకాంత్, మౌర్యా ఫౌండేషన్, భాగస్వామ్య సంస్థల కృషిని ప్రశంసించారు. ప్రజలు ‘డెసిబెల్డాష్-2025’ లో పాల్గొని వినికిడి ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “ప్రతి ఒక్కరూ వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాజాన్ని శబ్ద-స్మృతిగా మార్చేందుకు సహాయపడాలి” అని సూచించారు.
Read Also:Microsoft: హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి: సీఎం
డెసిబెల్డాష్-2025 వివరాలు
ఈ వినికిడి అవగాహన పరుగులో 2K, 5K, 10K విభాగాలు ఉన్నాయి. ఇది మార్చి 2, 2025న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది.మౌర్యా ఫౌండేషన్ వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకు ఉచిత పరీక్షలు, తక్కువ ఖర్చుతో చికిత్సలు అందిస్తూ, వినికిడి ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తోంది. మరిన్ని వివరాలకు: www.decibelldash.comసంప్రదించాలి. ఈ ఉద్యమంలో భాగస్వామి అవ్వండి. వినికిడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పరుగెత్తండి!
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!