Accenture Layoffs: అసలేం జరుగుతోంది.. మూడు నెలల్లో 11,000 ఉద్యోగులను తొలగింపు.. త్వరలో మరికొందరు కూడా?
- మూడు నెలల్లో 11,000 ఉద్యోగాలను తగ్గించిన యాక్సెంచర్ (Accenture)
- భవిష్యత్తు కోసం AI సేవలపై భారీ పెట్టుబడులు
- నైపుణ్యాలు పెంచుకోకపోతే ఉద్యోగాల కోత తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accenture Layoffs: యాక్సెంచర్ (Accenture) సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కేవలం మూడు నెలల్లోనే 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలిగించడమే.. ఈ ఉద్యోగాల కోత వచ్చే ఏడాది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియను సంస్థ “పునర్నిర్మాణ కార్యక్రమం”గా పేర్కొంటోంది.
Vidadala Rajini: వైసీపీ డిజిటల్ బుక్ యాప్లోనే.. మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఈ విషయమై యాక్సెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. భవిష్యత్తులో AI కీలక పాత్ర పోషించనుందని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సంస్థ కోరుకుంటోంది. ఒకవేళ ఉద్యోగులు త్వరగా నైపుణ్యాలను పెంచుకోలేకపోతే, వారిని తొలగించడం తప్పనిసరి అని తెలిపారు. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మొదటి ప్రాధాన్యత అయినప్పటికీ, అది సాధ్యం కాని చోట ఉద్యోగాల తొలగింపు తప్పదని ఆమె స్పష్టం చేశారు. కంపెనీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమం కోసం 865 మిలియన్ డాలర్లు (7,669 కోట్లు) ఖర్చు చేయనుంది. గత త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పునర్నిర్మాణంతో సంస్థకు ఒక బిలియన్ డాలర్స్ కు పైగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూనే, మరోవైపు యాక్సెంచర్ AI సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో AI ప్రాజెక్టుల ద్వారా 5.1 బిలియన్ల డాలర్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని సంస్థ తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా పేర్కొంది. సంస్థకు ప్రస్తుతం 77,000 మంది AI, డేటా నిపుణులు ఉన్నారని.. ఇది రెండు సంవత్సరాల క్రితం ఉన్న 40,000తో పోలిస్తే దాదాపు రెట్టింపు అని వెల్లడించారు.
Sohani Kumari: నటి కాబోయే భర్త ఆత్మహత్య.. తప్పు చేశానంటూ సెల్ఫీ వీడియో
ఈ పరిణామాలు కన్సల్టింగ్, ఐటీ సేవల రంగంలో విస్తృతమైన మార్పులను సూచిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు తమ బడ్జెట్లను తగ్గిస్తుండటం, అదే సమయంలో AIతో కూడిన సామర్థ్యాలు పెరగడం వల్ల యాక్సెంచర్ తన కార్యకలాపాలను మార్చుకుంటోంది. తక్కువ మంది, కానీ ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులతో తన క్లయింట్లను కొనసాగించగలమని ఆక్సెంచర్ నమ్ముతోంది. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!