కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తుల చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 342 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.. ఆ పోస్టుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీలు:
ఈ రిక్రూట్మెంట్ల కోసం రిజిస్ట్రేషన్ 5 ఆగస్టు 2023 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులను పూరించడానికి చివరి తేదీ 4 సెప్టెంబర్ 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) – 9 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) – 9 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) – 237 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – 66 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) – 3 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) – 18 పోస్టులు
ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి.. మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్సైట్కి aai.aero వెళ్లాలి.. నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోవాలి.. కొన్ని పరీక్షల తర్వాత ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు..ముందుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు తదుపరి ఇంటర్వ్యూ ఉంటుంది. దీని తర్వాత విద్యార్హత పత్రాల ధృవీకరణ ఉంటుంది. చివరకు సైకోయాక్టివ్ టెస్టు ఉంటుంది. అన్ని దశల్లో ఉత్తీర్ణులైన వారి ఎంపిక చివరిగా పరిగణించబడుతుంది…
ఇకపోతే జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్ వయస్సు 30 సంవత్సరాలు మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. దాని వివరాలను తెలుసుకోవడానికి.. మీరు అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయవచ్చు. B.Com, ఇంజనీరింగ్, MBA లా మరియు ICWA చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో, జీతం 1 లక్ష 40 వేల వరకు ఉంటుంది.. అంటే పోస్టులు బట్టి జీతం కూడా మారుతుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి.