యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత.. ఒక పవర్ఫుల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్లో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా నేచురల్ స్టార్ నాని..
Also Read : Mrunal Thakur : సరిహద్దులు చెరిపేస్తున్న హీరోయిన్.. మృణాల్
చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేసింది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే గంభీరమైన డైలాగ్తో మొదలైన ఈ ట్రైలర్, సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. గ్రిప్పింగ్ విజువల్స్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్తో సాగిన ఈ వీడియో చూస్తుంటే, ఆది ఈసారి ఒక విభిన్నమైన సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ‘శంబాల’ రహస్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
