NTV Telugu Site icon

Kurnool: ప్రాణాల మీదకు తెచ్చిన వింత పందెం.. బతికున్న చేపను మింగాలంటూ..

Fish

Fish

Kurnool: కర్నూలు జిల్లాలో ఓ వింత పందెం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసింది. బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా స్నేహితులు వేసుకున్న పందెంతో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బతికున్న చేపను మింగి వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వెల్దుర్తి మండలం బోగోలులో ఈ ఘటన చేసుకుంది. బోగోలులో ఓ స్నేహితుడు సరదాగా నువ్వు బతికున్న చేపను మింగగలవా అంటూ పందెం కాశాడు. ఈ క్రమంలోనే బతికి ఉన్న చేపను మింగడంతో గొంతులో చిక్కుకుని వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం బాధితుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చేపను బయటకు తీశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Nithya Pellikoduku: చదివింది తొమ్మిది.. మోసాలలో మాత్రం పీహెచ్‌డీ చేశాడు.. నిత్య పెళ్లికొడుకు ఆటకట్టించిన పోలీసులు