8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th Pay Commission : కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచింది. ఆ తర్వాత ఉద్యోగుల జీతం పెరిగింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పే కమిషన్(8వ వేతన సంఘం)ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2024 సంవత్సరంలో ఉద్యోగుల జీతంలో భారీ పెంపుదల ఉండబోతోంది.
కొత్త పే కమీషన్ పని ఎప్పుడు జరుగుతుంది?
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త వేతన సంఘంపై కసరత్తు జరగనుంది. ప్రస్తుతం కొత్త వేతన సంఘం విషయంలో ఎంప్లాయిస్ యూనియన్ తరపున దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతోంది. బెంగాల్తో పాటు పలు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎనిమిదో వేతన సంఘం గురించి ఎటువంటి చర్చ లేదు. దీనిపై పార్లమెంట్లో కూడా చర్చ నడుస్తోంది
Also Read
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
4వ వేతన సంఘం ద్వారా పెరిగిన వేతనం
జీతం పెరుగుదల – 27.6%
కనీస వేతనం – రూ 750
5వ వేతన సంఘం ద్వారా..
జీతం పెరుగుదల – 31%
కనీస వేతనం – రూ 2,550
6వ వేతన సంఘం ద్వారా..
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ – 1.86 సార్లు
జీతం పెరుగుదల – 54 శాతం
కనీస వేతనం – రూ. 7,000
7వ వేతన సంఘం ద్వారా..
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ – 3.68 రెట్లు సాధ్యం
జీతం పెరుగుదల – 44.44%
కనీస జీతం – రూ 26000 సాధ్యమే
2024 సంవత్సరం చివరిలో ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేయవచ్చని.. 2026 సంవత్సరంలో ఇది అమలు చేయబడుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. 7వ వేతన సంఘంతో పోలిస్తే ఇందులో భారీ మార్పులు ఉండొచ్చు. సుమారు 10 సంవత్సరాల తర్వాత పే కమిషన్లో మార్పు జరగనుంది. ప్రభుత్వం గతంలో పార్లమెంటులో సమాచారం ఇచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాని ప్రస్తావన లేదని పేర్కొంది. దీన్ని లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఖండించారు. కొత్త పే కమీషన్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తే 2024 సంవత్సరం సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!