8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th Pay Commission : కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచింది. ఆ తర్వాత ఉద్యోగుల జీతం పెరిగింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పే కమిషన్(8వ వేతన సంఘం)ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2024 సంవత్సరంలో ఉద్యోగుల జీతంలో భారీ పెంపుదల ఉండబోతోంది.
కొత్త పే కమీషన్ పని ఎప్పుడు జరుగుతుంది?
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త వేతన సంఘంపై కసరత్తు జరగనుంది. ప్రస్తుతం కొత్త వేతన సంఘం విషయంలో ఎంప్లాయిస్ యూనియన్ తరపున దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతోంది. బెంగాల్తో పాటు పలు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎనిమిదో వేతన సంఘం గురించి ఎటువంటి చర్చ లేదు. దీనిపై పార్లమెంట్లో కూడా చర్చ నడుస్తోంది
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
4వ వేతన సంఘం ద్వారా పెరిగిన వేతనం
జీతం పెరుగుదల – 27.6%
కనీస వేతనం – రూ 750
5వ వేతన సంఘం ద్వారా..
జీతం పెరుగుదల – 31%
కనీస వేతనం – రూ 2,550
6వ వేతన సంఘం ద్వారా..
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ – 1.86 సార్లు
జీతం పెరుగుదల – 54 శాతం
కనీస వేతనం – రూ. 7,000
7వ వేతన సంఘం ద్వారా..
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ – 3.68 రెట్లు సాధ్యం
జీతం పెరుగుదల – 44.44%
కనీస జీతం – రూ 26000 సాధ్యమే
2024 సంవత్సరం చివరిలో ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేయవచ్చని.. 2026 సంవత్సరంలో ఇది అమలు చేయబడుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. 7వ వేతన సంఘంతో పోలిస్తే ఇందులో భారీ మార్పులు ఉండొచ్చు. సుమారు 10 సంవత్సరాల తర్వాత పే కమిషన్లో మార్పు జరగనుంది. ప్రభుత్వం గతంలో పార్లమెంటులో సమాచారం ఇచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాని ప్రస్తావన లేదని పేర్కొంది. దీన్ని లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఖండించారు. కొత్త పే కమీషన్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తే 2024 సంవత్సరం సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!