8th CPC Approval: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి కేబినెట్ ఆమోదం
- 5 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.9 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం
- జనవరి 1, 2026 నుంచి అమలయ్యే ఛాన్స్
- ప్రస్తుతం దేశంలో 7వ వేతన సంఘం అమలులో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8th CPC Approval: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. 8వ వేతన సంఘం అమలు కోసం ఇప్పటికే కేబినెట్ ఛైర్పర్సన్ను ఎంపిక చేసింది. దీనికి ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. అలాగే 8వ కేంద్ర వేతన సంఘం అన్ని నిబంధనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను కేబినెట్ ముందు పెట్టనుంది. దీని ఆధారంగా 8వ వేతన సంఘం అమలు చేస్తారు.
READ ALSO: మీ ఆరోగ్యం కోసం AI కోచ్.. సరికొత్త టెక్నాలజీతో వచ్చేసిన Google..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
జనవరి 1, 2026 నుంచి అమలు
8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల 5 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.9 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. 8వ కేంద్ర వేతన సంఘం తాత్కాలిక సంస్థగా ఉంటుంది. ఇందులో ఛైర్పర్సన్, పార్ట్టైమ్ సభ్యుడు, సభ్య-కార్యదర్శి ఉంటారు. కమిషన్ ఏర్పడిన తేదీ నుంచి 18 నెలల్లోపు తన నివేదిక, సిఫార్సులను కేబినెట్కు సమర్పిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.
వేతన సంఘం ఏం చేస్తుందంటే..
8వ కేంద్ర వేతన సంఘం తన నివేదికను సమర్పించేటప్పుడు అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, అభివృద్ధి వ్యయం, సంక్షేమ చర్యలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయా, నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలకు నిధులు ఎన్ని ఖర్చు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఉద్యోగులకు లభించే జీత భత్యాలు, ప్రయోజనాలు పని పరిస్థితులు వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ప్రస్తుతం దేశంలో 7వ వేతన సంఘం అమలులో ఉంది. దీని ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యం చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రస్తుతం 58 శాతంగా అమలులో ఉంది.
సాధారణంగా వేతన కమిషన్ల సిఫార్సులు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అమలు చేస్తారు. అందువల్ల 8వ వేతన కమిషన్ను జనవరి 2026 నాటికి అమలు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనవరి నాటికి సిఫార్సులు అమలు అవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలలో అవసరమైన మార్పులను సమీక్షించి సిఫార్సు చేయడానికి ప్రభుత్వం 2025 జనవరిలో 8వ కేంద్ర వేతన కమిషన్ ఏర్పాటును ప్రకటించింది.
READ ALSO: Budget Geysers: తక్కువ ధరకు సూపర్ వాటర్ హీటర్లు..! ధర ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!